గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులపై కుటుంబ బాధ్యతలు బాగా పెరిగాయి. పెరుగుతున్న వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసరాల ధరల వల్ల భార్యాపిల్లలతో పాటు వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఉదాహరణకు, 7వ వేతన సంఘం నాటి పద్ధతినే వాడుతూ ఫ్యామిలీ యూనిట్ను 4.6 గా తీసుకుంటే, కనీస వేతనం రూ. 18,000 నుండి రూ. 27,600 కి చేరుకుంటుందని అంచనా.
అయితే, ఈ ఫ్యామిలీ యూనిట్ మార్పుపై 8వ వేతన సంఘం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం, అది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల జీతాలలో ఊహించని మార్పులకు కారణం అవుతుంది. జీతాల మ్యాట్రిక్స్ మొత్తం ఈ బేంచ్మార్క్తో ముడిపడి ఉండటం వల్ల, ఉద్యోగుల అకౌంట్లలోకి భారీగా డబ్బులు చేరడం ఖాయం.