మనం ఏదయినా శుభకార్యానికి వెళితే ఉత్తచేతులతో వెళ్ళకుండా బహుమతి తీసుకువెళతాం. బహుమతి మరిచిపోతే తోచినంత డబ్బులు చదివిస్తాం. అలాగే పూజారులకు, పండితులకు కూడా డబ్బులు దక్షిణగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం. వినాయకచవితి, దుర్గాష్టమి, ఇతర ధార్మిక కార్యక్రమాల కోసం కూడా తోచినంత చందా ఇస్తుంటాం. ఇలా డబ్బులు ఇచ్చే సమయంలో మీరో విషయం గమనించారా... 100, 500, 1000, 10,000, 1,00,000 ఇలా ఎంతిచ్చినా వాటికి చివర్లో 16 వచ్చేటట్లు ఇస్తుంటాం అంటే 116, 516, 1116,10,116, 1,00.116 ఇస్తుంటాం. ఇలా నూట పదహార్లు ఇవ్వడం సాంప్రదాయంలో భాగమయ్యింది... ఆనవాయితీగా మారింది.
అయితే ఇలా 116 పదహార్లు ఇవ్వడం వెనక ఎలాంటి సాంప్రదాయం లేదట. చివర్లో సున్నా ఉండటం శుభప్రదం కాదనే 116 చేరుస్తారనే వాదన ఉంది. ఇదికూడా నిజం కాదట. ఇలా నూట పదహార్లు అనే కాన్సెప్ట్ నిజాంల కాలంలో ప్రారంభమయ్యిందట. దీని వెనక ఆసక్తికరమైన స్టోరీ ఉందని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు తెలిపారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.