సాధారణంగా చాయ్ బిస్కెట్లను శుద్ధి చేసిన గోధుమ పిండి లేదా మైదాతో తయారు చేస్తారు. దీనిలో చక్కెర, వెజిటబుల్ ఫ్యాట్, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వంటి పదార్థాలు కలుపుతారు. కొన్నిరకాల బిస్కెట్లలో పాలు, గ్లూకోజ్ సిరప్, కృత్రిమ ఫ్లేవర్లు కూడా ఉంటాయి. తయారీ సమయంలో పిండిని బాగా కలిపి, కావాల్సిన ఆకారాల్లో కోసి, అధిక ఉష్ణోగ్రత దగ్గర బేక్ చేస్తారు. అందువల్ల ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా తయారవుతాయి. అయితే ఇందులో ఉపయోగించే మైదా పూర్తిగా శుద్ధి చేసిన పిండి కావడం వల్ల, దానిలో సహజ ఫైబర్, పోషకాలు ఏమీ ఉండవు.