Tulsi Plant: తులసి మొక్క పచ్చగా చిగురించాలంటే వారానికి ఒక్కసారి ఈ పొడి చల్లండి చాలు!

Published : May 10, 2026, 06:43 AM IST

Tulsi Plant: హిందువుల ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. ఈ మొక్కను లక్ష్మీదేవిలా భావించి పూజిస్తారు. ఈ మొక్క  భక్తికి ప్రతీక. కానీ పోషకాల లోపంతో చాలాసార్లు మొక్క ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. అప్పుడు పాటించాల్సిన చిట్కా ఇక్కడ ఇచ్చాము.

PREV
13
తులసి మొక్క పచ్చిగా ఉండాలంటే...

మనదేశంలోని ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంది. దీన్ని ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరమైన ఉద్దేశంతో పెంచుకుంటారు. అయితే ఈ మొక్కకు సరైన పోషకాలు లేకపోవడం, ఎక్కువ నీరు పోయడం లేదా ఎండ తగలకపోవడం వల్ల ఎండిపోతుంది. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇలాంటి టైంలో రసాయన ఎరువులకు బదులు ఇంట్లో దొరికే అరటి తొక్కలను వాడితే సరిపోతుంది.

 అరటి తొక్కలు సహజ ఎరువులా పనిచేస్తాయి. ఈ తొక్కల్లో పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మొక్క వేర్లను బలోపేతం చేసి, పెరుగుదలను వేగవంతం చేస్తాయి. దీంతో తులసి ఆకులు పచ్చగా మారుతాయి.

23
అరటి తొక్కల పొడి

తులసి మొక్కల కోసం ముందు అరటి తొక్కల పొడిని తయారుచేసుకోవాలి. ఇందుకోసం  అరటి తొక్కలను శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఒక లీటర్ నీటిలో ఒక చెంచా ఈ పొడిని కలిపి ద్రావణాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని తులసి మొక్క వేర్లకు పోయాలి. పోసే ముందు మట్టిని కొద్దిగా గుల్లగా చేస్తే పోషకాలు నేరుగా వేర్లకు చేరతాయి.

అయితే పచ్చి అరటి తొక్కలను నేరుగా మట్టిలో కలపకూడదు. దీనివల్ల మొక్కకు ఫంగస్ లేదా కీటకాల బెడద ఏర్పడవచ్చు. వారానికి ఒకసారి ఈ పొడిని వాడితే మొక్క పచ్చగా, ఏపుగా పెరుగుతుంది.

33
ఈ జాగ్రత్తలు తీసుకోండి

తులసి మొక్క ఆకుపచ్చగా ఎదిగేందుకు ఎరువు వేస్తే సరిపోదు సరైన సంరక్షణ కూడా ముఖ్యం. మొక్కకు రోజుకు కనీసం 4–5 గంటల ఎండ తగిలేలా చూసుకోండి. నీళ్లు  మరీ ఎక్కువగా పోయవద్దు, కుండీలోని మట్టిలోంచి నీరు సులభంగా బయటకు వెళ్లేలా ఉండాలి. ఎప్పటికప్పుడు మొక్కకు ఉన్న ఎండిన ఆకులను తీసేస్తే మొక్క పెరుగుదల బాగుంటుంది. ఈ జాగ్రత్తలతో పాటు అరటి తొక్కల చిట్కా పాటిస్తే, ఎండిపోతున్న తులసి మొక్క కూడా మళ్లీ పచ్చగా చిగురిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories