జామకాయ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, విరేచనాలు కావడం, గ్యాస్ట్రిక్ సమస్య మొదలవడం, గుండెల్లో మంట, జీర్ణం కాకపోవడం వంటివి కనిపిస్తే మీకు జామకాయ పడడం లేదని అర్థం. జామకాయలో ఉండే విటమిన్ సి, ఫ్రక్టోజ్ వంటివి జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. అలాగే జామ గింజలు కూడా జీర్ణ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు కనిపించినా కూడా జామకాయకి దూరంగా ఉండాలి. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు, గొంతు నొప్పితో బాధపడుతున్న వారు కూడా జామకాయలు తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనికి శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉంటుంది.