Health: ఆరోగ్యానికి మేలు చేస్తుందని వెల్లుల్లిని అతిగా తీసుకుంటే అంతే సంగతులు..

First Published Jan 23, 2022, 5:07 PM IST

Health: కరోనా రాకతో ప్రజలు ఆహారపు అలవాట్లు పూర్తి మారిపోతున్నాయి. అంటే ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదంతా కరోనా చలవనే చెప్పాలి. కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి పోషకవిలువలుండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. వీటిలో ఒకటైన వెల్లుల్లి వాడకం కూడా బాగా పెరిగింది. అయితే..

Health: కరోనా పుణ్యమా అని జనాలంతా మెరుగైన ఆహారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మందిచి? ఏయే ఆహార పదార్థాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో అలాంటి ఆహారాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. వాటినే తినడం అలవాటు చేసుకుంటున్నారు.  అందులోనూ బలమైన ఆహారమే కరోనాకు విరుగుడు అని నిపుణులు చెప్పడంతో వాటినే ఎక్కువగాతింటున్నారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఈ వెల్లుల్లిలో కాల్షియం, పొటాషియం, కాపర్, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ బీ1 వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ప్రతి వంటలో వెల్లుల్లిని ఖచ్చితంగా వాడుతున్నారు. 


కూరల్లో రుచిని పెంచడంతో పాటుగా ఇమ్యునిటీ పవర్ ను పెంచడంలో కూడా వెల్లుల్లి అన్నింటికంటే ముందుంటుంది. అందుకే జనాలు ఈ వెల్లుల్లి వాడకాన్ని విపరీతంగా పెంచేశారు. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని మితిమీరి దీన్ని వాడితే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని అతిగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
 

blood pressure

వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని మోతాదుకు మించి తీసుకుంటే Blood pressure తగ్గే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు బీపీ తక్కువ ఉన్నవారు వెల్లుల్లిని మోతాదుకు మించి తీసుకుంటే రిస్క్ తప్పదని పేర్కొంటున్నారు. 

వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే చాతిలో మంట సమస్య వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అసిడిటీ సమస్య ఉన్నవారికి ఇది ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు మోతాదులోనే వెల్లుల్లిని తీసుకోవాలి. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే చాతిలో మంట సమస్య వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అసిడిటీ సమస్య ఉన్నవారికి ఇది ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు మోతాదులోనే వెల్లుల్లిని తీసుకోవాలి. 

వెల్లుల్లి కమ్మనైన రుచిని ఇవ్వడమే కాదు.. వాసన వచ్చేలా కూడా చేస్తుంది. అంటే ఎక్కువగా వెల్లుల్లిని ఎవరైతే తీసుకుంటారో వారికి నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు వెళ్లడిస్తున్నారు. అంతేకాదు చెమట కూడా దారుణంగా వచ్చి అది దుర్గందంగా మారే ఛాన్సెస్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. 

click me!