భర్త చనిపోయిన స్త్రీల జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా తమ తలలో పూలు పెట్టుకోవడం కూడా మానేస్తూ ఉంటారు. ఇది కరక్టేనా? నిజంగానే పూలు పెట్టుకోకూడదా?
హిందూ సంస్కృతిలో మహిళలు తలలో పూలు పెట్టుకునే సంప్రదాయం ఉంది. పూలు పెట్టుకోవడం అనేది కేవలం అందానికి సంబంధించిన విషయం కాదు. ఇది శాస్త్రానికి, ఆరోగ్యానికి కూడా సంబంధించినది. పూల నుంచి వచ్చే వాసన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మల్లెపూల సువాసన కోపాన్ని తగ్గించి, ఒత్తిడిని నియంత్రించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే శక్తి ఉంటుంది. పూలు మహిళలకు సహజ సౌందర్యాన్ని, ఆకర్షణను అందిస్తాయి. అంతేకాకుండా.. పూలు ధరించే మహిళల మెదడు చురుకుగా ఉంటుంది. మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది.
23
పూలు పెట్టడం ఒక సాంస్కృతిక చిహ్నం...
హిందూ సంప్రదాయం ప్రకారం... మహిళలు తలలో పూలు ధరించడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో సంపద, శ్రేయస్సు కూడా పెరుగుతాయి అని భావిస్తారు. అయితే... భర్త మరణం తర్వాత తలలో పూలు ధరించాలా? వద్దా అనే దానిపై కొంత మంది మహిళలకు సందేహాలు ఉండొచ్చు. దీని గురించి చాలా భిన్న అభిప్రాయాలు వినపడుతూ ఉంటాయి.
33
పూలు భర్తతో రాలేదు...
నిజానికి, మహిళలు చిన్నప్పటి నుంచి పూలు ధరిస్తూనే ఉంటారు. పూలు స్త్రీ జాతికి చెందినవి. భర్త చనిపోతే పూలు ధరించకూడదు అనే నమ్మకాన్ని ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు. కానీ, ఒకప్పుడు భర్త ఉన్న మహిళలు.. భర్త చనిపోయిన మహిళలకు తేడా గుర్తించడానికి.. ఇలా పూలు పెట్టుకోకూడదు, నుదిటిన బొట్టు పెట్టుకోకూడదు అనే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. కానీ... భర్తకు పూలకు ఎలాంటి సంబంధం లేదు. భర్త వచ్చిన తర్వాత మహిళలు పూలు పెట్టుకోవడం మొదలుపెట్టలేదు. కాబట్టి.. వారు తమ చివరి క్షణం వరకు పూలు ధరించవచ్చు.ఏ వయసు వారు అయినా ఈ పూలను ధరించొచ్చు. అయితే.. ఈ విషయాన్ని చాలా మంది అంగీకరించకపోవచ్చు.