గర్భిణులు భక్తి పేరుతో ఎలాంటి ఉపవాసాలు చేయకూడదు. కఠిన పూజలు చేయనవసరం లేదు. స్వచ్ఛమైన మనసుతో శివుడిని ప్రార్థిస్తే చాలు. గర్భిణులు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
శివుడికి చంద్రుడితో అనుబంధం ఉంటుంది. కుజుడిని శివుని శక్తికి చిహ్నంగా భావిస్తారు. గర్భిణుల శరీరం, మనస్సులో మార్పులు వస్తాయి. ఈ సమయంలో చంద్ర, రాహు, కేతువుల ప్రభావం బలంగా ఉంటుంది. తీవ్ర శక్తి ఉన్న చోట ఎక్కువసేపు ఉండటం గర్భిణులకు మంచిది కాదని అంటారు.
గర్భిణులు శివలింగాన్ని తాకకూడదు. కానీ గుడికి వెళ్లి శివుడిని దర్శించుకోవచ్చు. పూర్వం గుళ్లు చిన్నగా ఉండి రద్దీతో ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు గుళ్లలో వెలుతురు, సౌకర్యాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు శివ దర్శనం చేసుకోవచ్చు. ఇది మనసుకు శాంతినిస్తుంది. కానీ శివలింగం దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు.