వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ పిల్లలు ఎంత తొందరగా పుడితే అంత మంచిదని భావిస్తారు. నిజానికి ఈ రోజుల్లో చాలా మంది 30 ఏండ్లు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయినా అప్పుడే పిల్లలు వద్దని రెండు మూడేండ్లు వాయిదా వేసుకుంటున్నారు. నిజానికి పిల్లల్ని సరైన వయసులో కంటేనే మంచిది. లేదంటే పిల్లలకు, తల్లులకు లేనిపోని అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది.
జీవనశైలిలో మార్పులు, ఇతర కారకాల వల్ల గత దశాబ్దం నుంచి మన దేశంలో సంతానోత్పత్తి రేటు ప్రతి ఏడాది సుమారుగా 1 శాతం తగ్గుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే 35 ఏండ్ల తర్వాత సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులోని ఆడవారు గర్భందాల్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకవేళ గర్భం దాల్చిన ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే..