పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి. ఆ నూనెలో ధనియాలను, మెంతులను, ఎండుమిర్చిని, మినప్పప్పును వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలకూరను వేసి వేయించాలి. అందులోనే పసుపు, చింతపండు కూడా వేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పాలకూర మెత్తగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి. పాలకూర రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మిక్సీలో మొదటగా వేయించుకున్న ధనియాలు, మినప్పప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత పాలకూరను కూడా అందులో వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తాళింపు పెట్టుకోవాలి. తాళింపు కోసం స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. అందులో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి దాన్ని పాలకూర పచ్చడి పై వేసుకోవాలి. అంతే టేస్టీ పచ్చడి రెడీ అయిపోయినట్టే.