హైదరాబాద్ శివారులోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఇవాళ (జూలై 7, మంగళవారం) వీక్లీ ట్రైన్ ప్రారంభం అవుతుంది. ఇక ప్రతి మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు 17077 నంబర్ ట్రైన్ చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 8.50కి తిరుపతి, మధ్యాహ్నం 1.20కి తిరువణ్ణామలై, సాయంత్రం 4.30కి శ్రీరంగం చేరుకుంటుంది. సాయంత్రం 6.45కి చివరి స్టేషన్ తిరుచిరాపల్లి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 17078 నంబర్ రైలు ప్రతి బుధవారం రాత్రి 9.30కి తిరుచిరాపల్లి నుంచి బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 9.52కి శ్రీరంగం, మరుసటి రోజు తెల్లవారుజామున 1.28కి తిరువణ్ణామలై, గురువారం ఉదయం 7.05కి తిరుపతి, రాత్రి 10.20కి చర్లపల్లికి చేరుకుంటుంది. ఇలా మంగళ, బుధ, గురువారం మూడ్రోజుల్లో మూడు పుణ్యక్షేతాలను రెండుసార్లు టచ్ చేస్తుంది ఈ ట్రైన్.
ఈ స్పెషల్ ట్రైన్లో 3 సెకండ్ ఏసీ (2AC) కోచ్లు, 5 థర్డ్ ఏసీ (3AC) కోచ్లు, 10 స్లీపర్ కోచ్లు, 4 జనరల్ కోచ్లు ఉన్నాయి. వివిధ వర్గాల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కోచ్లను ఏర్పాటు చేశారు.