మనీ ప్లాంట్ వేర్లు బాగా పెరగాలంటే మట్టి తేలికగా ఉండాలి. ఇందుకోసం ఎర్రమట్టి, కోకోపీట్ లేదా ఇసుక, వరి పొట్టు కలపాలి. మట్టిలో ఫంగస్ రాకుండా ఉండేందుకు కొద్దిగా వేప పిండి కలిపితే మంచిది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో మెరవాలంటే, నైట్రోజన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే 'ఎప్సమ్ సాల్ట్' ఒక చెంచా మట్టిలో కలపాలి. ఒకవేళ ఎప్సమ్ సాల్ట్ లేకపోతే, వాడిన టీ పొడిని మూడు నుంచి నాలుగు చెంచాలు మట్టిలో ఎరువులాగా కలుపుకోవచ్చు.
మనీ ప్లాంట్ను ఎప్పుడూ కూడా నేరుగా ఎండలో పెట్టకూడదు. బాల్కనీలో లేదా ఇంట్లో వెలుతురు పడేలా నీడ ప్రదేశంలో ఉంచడం మంచిది. మట్టి పైపొర ఆరినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి. మొక్క నాటిన మొదటి రెండు నెలలు బియ్యం కడిగిన నీళ్లు పోస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది.