మనీ ప్లాంట్ కు ఈ పొడిని వేయండి చాలు పచ్చగా, గుబురుగా పెరిగేస్తుంది

Published : Aug 23, 2026, 09:52 AM IST

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? అది గుబురుగా, పచ్చగా కాకుండా వాడిపోతోందా? నర్సరీల్లో మనీ ప్లాంట్ ఎంత పచ్చగా ఉంటుందో, గుబురుగా పెరుగుతుందో అలా మీ మొక్క కూడా ఉండాలంటే చిన్న పని చేయండి చాలు.

PREV
13
మనీ ప్లాంట్ పెరిగేందుకు చిట్కాలు

మనీ ప్లాంట్ ఇంట్లో ఉండే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. పచ్చని ఆకులతో ఉండే మనీ ప్లాంట్ చూడగానే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఆ మొక్క ఆరోగ్యంగా పెరగదు. ఆకులు త్వరగా కోసం చాలామంది మనీ ప్లాంట్‌ను పెంచుతారు. కానీ కొన్నిసార్లు ఆకులు పసుపు రంగులోకి మారడం, మొక్కల పెరుగుదల సరిగా లేకపోవడం జరుగుతుంది. నర్సరీల్లో ఉన్నట్లు మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలంటే ఈ చిట్కాలను పాటించండి.

23
ఈ చిట్కాలతో మనీప్లాంట్ పచ్చగా

మనీ ప్లాంట్ నాటడానికి పెద్ద కొమ్మల కంటే, కణుపులు (Nodes) ఉన్న చిన్న కొమ్మలను ఎంపిక చేసుకోవాలి. ఈ కణుపుల నుంచే వేర్లు సులభంగా వస్తాయి. కొమ్మలను మట్టిలో నిటారుగా కాకుండా, కొంచెం వాలుగా నాటుకోవాలి. దీనివల్ల ఎక్కువ కణుపులు మట్టికి తగిలి, వేర్లు త్వరగా వ్యాపిస్తాయి.

ఈ మొక్క కోసం కొంచెం పెద్ద కుండీని ఎంపిక చేసుకోవాలి. కింద నీరు పోవడానికి రంధ్రం ఉండేలా చూసుకోండి. కుండీ మధ్యలో ఒక మాస్ స్టిక్ లేదా పైపును పెడితే, మొక్క దానిపైకి పాకి చూడటానికి అందంగా కనిపిస్తుంది.

33
ఈ పొడిని చల్లండి

మనీ ప్లాంట్ వేర్లు బాగా పెరగాలంటే మట్టి తేలికగా ఉండాలి. ఇందుకోసం ఎర్రమట్టి, కోకోపీట్ లేదా ఇసుక, వరి పొట్టు కలపాలి. మట్టిలో ఫంగస్ రాకుండా ఉండేందుకు కొద్దిగా వేప పిండి కలిపితే మంచిది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో మెరవాలంటే, నైట్రోజన్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే 'ఎప్సమ్ సాల్ట్' ఒక చెంచా మట్టిలో కలపాలి. ఒకవేళ ఎప్సమ్ సాల్ట్ లేకపోతే, వాడిన టీ పొడిని మూడు నుంచి నాలుగు చెంచాలు మట్టిలో ఎరువులాగా కలుపుకోవచ్చు.

మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ కూడా నేరుగా ఎండలో పెట్టకూడదు. బాల్కనీలో లేదా ఇంట్లో వెలుతురు పడేలా నీడ ప్రదేశంలో ఉంచడం మంచిది. మట్టి పైపొర ఆరినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి. మొక్క నాటిన మొదటి రెండు నెలలు బియ్యం కడిగిన నీళ్లు పోస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories