మొక్కల మట్టిపై చిన్న పురుగులు లేదా చీమలు పట్టేస్తూ ఉంటాయి. మట్టి పైపొరపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే ఆ సమస్య రాదు. పసుపు వాసనకు, దాని గుణానికి పురుగులు మొక్కల దగ్గరకు రావు, ఆ మట్టిపై చేరవు.
మొక్క కొమ్మ విరిగినా లేదా మీరు ప్రూనింగ్ (కొమ్మలను కత్తిరించడం) చేసినా, ఆ కత్తిరించిన భాగానికి పసుపు పొడిని పెట్టడం లేదా నీళ్లు కలిపి పేస్టులా రాయడం వంటివి చేయండి. ఇది మనుషుల గాయానికి పసుపు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. ఆ భాగానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తుంది.