సముద్రం మధ్యలో తియ్యటి నీటి సీక్రెట్..
చుట్టూ మైళ్ల కొద్దీ అరేబియా సముద్రం.. నోట్లో చుక్క కూడా పోసుకోలేని ఉప్పు నీరు, కానీ ఆ సముద్రం మధ్యలో ఒక చారిత్రక కోట.. ఆ కోటలోకి అడుగుపెడితే..తీయని నీరు దొరుకుతుంది. పాలు, పెరుగు, పంచదార పేర్లతో పిలిచే ఆ మూడు తీపి నీటి బావుల వెనక కథేంటి? ఉప్పు నీటి మధ్యలో తియ్యటి నీరు ఎలా సాధ్యం అయ్యింది? దీని వెనక సైన్స్ ఏంటి?
సింధూ దుర్గ్ కోట..
మహారాష్ట్రలోని మాల్వన్ తీరానికి కాస్త దూరంలో, అరేబియా సముద్రంలో ఉమ్మడి ద్వీపంపై నిర్మించినదే 'సింధుదుర్గ్ కోట' . ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనిక వ్యూహంతో నిర్మించిన ఈ కోటలో శత్రువులు ఊహించని ఒక ప్రత్యేకత ఉంది.
కోట లోపల దూధ్బావ్ (Milk Well), సాఖర్బావ్ (Sugar Well), దహీబావ్ (Curd Well) అని పిలిచే మూడు ప్రత్యేకమైన బావులు ఉన్నాయి. సముద్రపు ఒడ్డున ఎంత తవ్వినా ఉప్పునీరే పడే చోట.. ఈ బావుల్లో మాత్రం తీయని తాగునీరు లభిస్తుంది.