Healthy Diet After 30: వయసు 30 దాటిందా? ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉండటమే మంచిది!

Published : Aug 29, 2026, 05:31 PM IST

Healthy Diet After 30: 30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో చాలా మార్పులు మొదలవుతాయి. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుంది. నిపుణుల ప్రకారం 30 తర్వాత ఏ ఆహారాలను తగ్గించాలి, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
30 ఏళ్లు దాటాక తినకూడని ఆహారాలు

వయసు 30 దాటాక, ఒకప్పటిలా ఏది తిన్నా శరీరం తట్టుకుంటుంది అనుకోవద్దు. వయసు పెరిగే కొద్దీ బరువు, రక్తపోటు, షుగర్ లెవెల్స్, గుండె ఆరోగ్యం వంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఇష్టమైన ఫుడ్స్ అన్నీ మానేయాలని కాదు, కానీ కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా ఉండడం మంచిది. అవేంటో తెలుసుకుందాం.

25
చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్

చక్కెర ఎక్కువగా ఉండే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్‌లను తరచుగా తాగడం మానుకోవాలి. అధిక చక్కెర అనవసరమైన కేలరీలను పెంచి, బరువు పెరగడానికి కారణమవుతుంది. అంతేకాదు, ఇది చర్మంలోని కొల్లాజెన్‌తో కలిసి ముడతలకు దారితీస్తుంది. వీటికి బదులుగా చక్కెర లేని నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగొచ్చు.

35
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు

చిప్స్, స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడిల్స్, ఊరగాయలు, ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి తరచుగా తింటే రక్తపోటు పెరిగి, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉప్పు వాడకాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. WHO సిఫార్సు ప్రకారం, పెద్దలు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఇలాంటి స్నాక్స్‌కు బదులు ఉడికించిన గింజలు, పప్పులు, పండ్లు తినడం మంచిది.

45
ప్రాసెస్ చేసిన మాంసం

మాంసాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఐరన్, విటమిన్ B12 వంటి పోషకాలను అందించడంలో మాంసాహారం సహాయపడుతుంది. కానీ ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తినడం మంచిదికాదు. వీటిలో ఉప్పు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు చేపలు, గుడ్లు, పప్పు ధాన్యాలు వంటి ఇతర ప్రొటీన్ ఫుడ్స్ తినడం మంచిది.

55
వేయించిన ఆహారాలు

వడ, బజ్జీ, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి డీప్-ఫ్రైడ్ ఫుడ్స్, కొన్ని బేకరీ ఐటమ్స్ తరచుగా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి, మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే, బ్రెడ్, మైదా పరోటా, పూరీ, పాస్తా, బిస్కెట్లు త్వరగా చక్కెరగా మారి, ఆకలిని పెంచి, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.

సాధారణంగా వయసు 30 దాటాక జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల రక్తపోటు, LDL కొలెస్ట్రాల్, బ్లెడ్ షుగర్ వంటివి క్రమంగా పెరగడం మొదలవుతుంది. కాబట్టి, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల అధిక బరువు, గుండె, రక్తపోటు, షుగర్ వ్యాధి వంటి సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories