సిట్రస్ పండ్లు
ఆయుర్వేదం ప్రకారం.. పాలు, సిట్రస్ పండ్లను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు ఆమ్లంగా ఉంటాయి. ఇవి పాలలో కలిసినప్పుడు పాలు విరిగిపోతాయి. అందుకే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను పాలలో కలపకూడదు. పాల తాగిన తర్వాత సిట్రస్ పండ్లను ఆ వెంటనే తినడం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.