ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు మరింత పెరిగిపోతోంది. అంతెందుకు దేశంలో హైదరాబాద్ తో సహా ఎన్నో నగరాల్లో ఈ వాయుకాలుష్యం పెరుగుతోంది. కానీ కలుషితమైన గాలి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటాయి. వాయుకాలుష్యం వల్ల.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, పిల్లలు, వృద్ధులు ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. కలుషితమైన గాలి వల్ల చాలా మంది శ్వాసకోశ సమస్యలు వస్తయ్. అలాగే కళ్ళు, గొంతులో నొప్పి వస్తుంది.