నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు శరీరంలో మంట కలుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అవసరమైన వాటికంటే నీళ్లను మరీ ఎక్కువగా తాగేస్తే శరీరంలో సోడియం, ఎలక్ట్రోలైట్ల పరిమాణం చాలా తగ్గుతుంది. దీనివల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే వాపు శరీర కణజాలాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.