వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులే కాదు ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. వాయు కాలుష్యం వల్ల కలిగే వ్యాధుల కారణంగా ప్రతి ఏటా లక్షల మంది చనిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. నగరాల, గ్రామీణ ప్రాంతాలు అంటూ తేడా లేకుండా వాయు కాలుష్యం ప్రతి చోటు ఉంది. ఈ వాయు కాలుష్యం ఊపిరితిత్తుల వైఫల్యానికి మాత్రమే కాకుండా స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతోంది. ఈ వాయు కాలుష్యం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయో తెలుసుకుందాం పదండి..