ఖర్జూరాలను క్రమం తప్పకుండా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో ఎక్కువ మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఖర్జూరంలో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లు మాత్రమే కాదు.. విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 3, విటమిన్ బి 5 ఎ 1 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నానబెట్టిన ఖర్జూరాలను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇననీ కాదు.. అవేంటంటే..