వేరుశెనగలను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
ఆరోగ్యంగా ఉండేందుకు పల్లీలను తినడం మంచిదే కానీ.. వీటిని అతిగా తినడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిలో ఇనుము, మాంగనీస్, జింక్, కాల్షియం వంటి ఇతర ఖనిజాలు శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇవి బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తాయి. అలాగే జీర్ణసమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా అలెర్జీ సమస్య ఉన్నవాళ్లు వీటిని మొత్తమే తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే గొంతు నొప్పి, చర్మ సమస్యలు, ముక్కు కారడం, జీర్ణ సమస్యలు, శ్వాస అడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మొత్తంగా పల్లీలను మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.