Gym Mistakes: వ్యాయామం చేసిన వెంటనే నీళ్లను తాగుతున్నారా..? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా..?

First Published Aug 9, 2022, 4:09 PM IST

Gym Mistakes: శరీరం  ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి జిమ్ముల్లో కసరత్తులు చేయడం చాలా అవసరం. అయితే వ్యాయామాలు చేసే వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 
 

ఈ రోజుల్లో చాలా మంది ఆహారపు అలవాట్లు సోమరులను చేసేవిగా.. విపరీతంగా బరువును పెంచేవిగా ఉన్నాయి. ఇక బరువును తగ్గించుకునేందుకు జిమ్ములకు కొంతమంది వెళితే.. మరికొంతమంది మాత్రం.. పెరిగితే పెరగని అదె తగ్గుతని నిర్లక్ష్యంగా ఉంటారు. దీనివల్ల ఒక్కటేమిటీ ఎన్నో రకాల రోగాలొస్తాయి. ఈ సంగతి పక్కన పెడితే ఆరోగ్యం కోసం రెగ్యులర్ గా జిమ్ములకు వెళ్లి కసరత్తులు చేస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వ్యాయామాలు చేసే వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన శరీరం 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. ఈ నీటి శాతం తగ్గితే.. గుండెల్లో మంట, వెన్ను నొప్పి, శరీర బలహీనత, తలనొప్పి, మైకము వంటి సమస్యలు వస్తాయి. దీంతో మనకు బాగా దాహం అవుతుంది. ఎందుకంటే శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు శరీరం ఇతర అవయవాల నుంచి నీటిని తీసుకోవడం ప్రారంభిస్తుంది. అందుకే దాహం వేసినా.. వేయకపోయినా నీటిని మాత్రం ఖచ్చితంగా తాగుతూ ఉండాలి. 
 


వ్యాయామం చేసేటప్పుడు నీళ్లను తాగొచ్చా?

ఎక్సర్ సైజ్లు చేసేటప్పుడు శరీరం బాగా అలసిపోతుంది. శక్తి కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. ఎక్కువ సేపు వ్యాయామాలు చేస్తే శరీరం నుంచి నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. దీంతో ఆ సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్సర్ సైజ్లు చేసిన వెంటనే నీటిని తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వ్యాయామాలు చేసి బాడీ టెంపరేచర్ బాగా పెరుగుతుంది. ఆ సమయంలో చల్లని నీళ్లను తాగడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. 
 

జిమ్ముల్లో కసరత్తులు చేసిన  తర్వాత శరీర చెమట మొత్తం ఆరిపోయేంత వరకు కొద్ది సేపటిదాక రెస్ట్ తీసుకోండి. శరీరం చల్లబడిన తర్వాతే నీళ్లను తాగండి. 
 

ముఖ్యంగా నీళ్లను ఫాస్ట్ గా తాగడకూడదు. మెల్లిమెల్లిగానే సిప్ చేయాలి. ఇంకొక విషయం నీళ్లను నిలబడి తాగకూడదు. వ్యాయామాలు చేసిన గంట నుంచి 2 గంటల వరకు ఫ్రిజ్ లో ఉండే నీళ్లను తాగకూడదు. 
 


వ్యాయామాలు అయిపోయిన తర్వాత మీరు తాగే నీటిలో కొంచెం పంచదార, ఉప్పును వేసుకుని తాగండి. ఈ వాటర్ ఎలక్ట్రోలైట్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. 

click me!