చలి రోజు రోజుకు పెరిగిపోతోంది. చలితీవ్రత పెరిగే కొద్దీ చాలా మంది అనేక జబ్బుల బారిన పడుతుంటారు. చలికాలంలో పసుపు పాలను తాగడం ప్రయోజనకరంగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అందుకే చలికాలంలో పిల్లలు, పెద్దలు పసుపు పాలను పక్కాగా తాగుతుంటారు. నిజానికి చలికాలంలో పసుపు పాలను తాగడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ వంటి ఇతర అనారోగ్య సమస్యలను కలిగించే శీతాకాలపు వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడటానికి మన శరీరానికి శక్తి అందుతుంది. ఈ పాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గోల్డెన్ మిల్క్ వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..