Fish Diet: చేపలు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎలా పడితే అలా తినకూడదు. చేపలు తిన్నాక కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే జీర్ణం కాక మోషన్స్, వాంతులు కూడా అవ్వొచ్చు. మరి అవెంటో ఇక్కడ చూద్దాం.
చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదే. వాటిలో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సో వారానికి 2, 3 సార్లు అయితే ఫుడ్ లో చేర్చుకోవాలి. అయితే చేపలు తిన్నాక కొన్నింటిని తినకూడదని ఇంట్లో చెబుతుంటారు. మరి అవెంటో తెలుసా? ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
26
పాలు
చేపలు తిన్న తర్వాత పాలు తాగడం అస్సలు మంచిది కాదు. చేపలు, పాలు కలిపి తీసుకుంటే చర్మంపై తెల్లమచ్చలు వచ్చే అవకాశం ఉంది. కడుపునొప్పి కూడా రావొచ్చు. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే చేపలు తిన్న వెంటనే పాలు తాగే పొరపాటు చేయకండి.
36
టీ, కాఫీలకు దూరంగా ఉండాలి
చేపలు తిన్న వెంటనే టీ, కాఫీలు కూడా తాగకూడదు. వీలైతే దూరంగా ఉండాలి. టీ, కాఫీలలో ఉండే టానిన్లు, కెఫిన్.. శరీరంలోని పోషకాలను గ్రహిస్తాయి. చేపలు తిన్న తర్వాత కనీసం 1 నుంచి 2 గంటల గ్యాప్ ఇచ్చి టీ లేదా కాఫీ తాగాలి.
చేపలు తినేటప్పుడు పుల్లటి పండ్లను ఎక్కువగా తినొద్దు. చేపలు తిన్న వెంటనే సిట్రస్ పండ్లు తింటే అసిడిటీ, ఛాతీలో మంట వంటి సమస్యలు వస్తాయి.
56
అజీర్తి, గ్యాస్
చేపలు తిన్న తర్వాత వేయించిన ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. వీటిని తింటే కడుపులో తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి. అజీర్తి, గ్యాస్, కడుపునొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
66
పెరుగు తినకూడదు
చేపలు తిన్న తర్వాత పెరుగు కూడా తినకూడదు. ఒకవేళ చేపలతో పాటు పెరుగు తింటే, కడుపులో తీవ్రమైన సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయి.