ప్రాసెస్ చేసిన పిండిపదార్థాలు
వైట్ బ్రెడ్, పాస్తా మైదాతో చేసిన ఆహారాలన్నీ శుద్ది చేసిన పిండితో తయారుచేసినవే. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. పోషకాలు మొత్తమే ఉండవు. మధుమేహులు వీటిని తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తినండి.