
మన శరీరంలో నీళ్లే ఎక్కువ శాతం ఉంటాయి. నీళ్లతోనే శరీరం ఎన్నో రోగాల నుంచి తప్పించుకుంటుంది. కానీ చాలా మంది నీళ్లంటేనే ముఖం వికారంగా పెడుతుంటారు. కేవలం భోజనం చేసినప్పుడు మాత్రమే నీళ్లను తాగుతుంటారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే నీళ్లను తాగితే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే శరీరంలో నీటి స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల శరీరానికి శక్తి ఉండదు. ఎప్పుడూ చూసినా నీరసంగానే ఉంటారు. తలనొప్పి, మలబద్దకం, హెయిర్ ఫాల్, పాలిపోయిన చర్మం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే నీళ్లను ఎక్కువగా తాగాలి. అయితే నీళ్లను తాగడానికి కూడా ఓ పద్దతి ఉంటుందంటున్నారు నిపుణులు. నిలబడి నీళ్లను అసలే తాగకూడదని చెబుతున్నారు. నిలబడి నీళ్లను తాగేకంటే.. కూర్చొని నీళ్లను తాగడం మంచిదంటున్నారు. ఇంతకు నిలబడి నీళ్లను తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నిలబడి నీళ్లను తాగడం వల్ల కడుపులోకి నీరు ఫాస్ట్ గా వెలుతుతుంది. దీంతో జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే నిలబడి నీళ్లను తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
నీళ్లను కూర్చొనే ఎందుకు తాగాలి?
కూర్చొని నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా జరుగుతుంది. అంతేకాదు కణాలకు కూడా నీరు బాగా చేరుకుంటుంది. దీంతో శరీరంలో ఉండే విషపదార్థాలు బయటకు వెళతాయి. అలాగే రక్తం శుభ్రంగా ఉంటుంది. శరీరం కూడా హెల్తీగా ఉంటుంది.
నిలబడి నీళ్లను ఎందుకుు తాగకూడదు
మూత్రపిండాల వైఫల్యం
నిలబడి నీళ్లను తాగితే మూత్రపిండాలకు ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ పొజీషన్ లో నీళ్లను తాగడం వల్ల రక్త కణాలకు నీరు సరిగ్గా అందదు. దీంతో రక్తంలో మలినాలు అలాగే ఉంటాయి. అంతేకాదు అవి మరింత పెరుగుతాయి. దీంతో రక్తం నుంచి విషపదార్థాలను తొలగించడం మూత్రపిండాలకు కష్టంగా మారుతుంది. దీంతో కిడ్నీలకు సంబంధించిన వ్యాధులొస్తాయి.
పేలవమైన జీర్ణక్రియ
మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో జీర్ణక్రియ ఒకటి. అయితే ఈ జీర్ణక్రియ నిలబడి నీళ్లను తాగడం వల్ల దెబ్బతింటుంది. దీంతో అన్నవాహికలో సమస్యలు వస్తాయి. అజీర్థి, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిజానికి మనం కూర్చొని నీళ్లు తాగితేనే జీర్ణక్రియ ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా రావు.
శ్వాస సంబంధ సమస్యలు
నిల్చొని నీళ్లను తాగితే అన్నవాహికపై చెడు ప్రభావం పడుతుంది. ఇది ఊపిరితిత్తులపై, శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ కు దారితీస్తుంది.
ఆర్థరైటిస్
నిలబడి నీళ్లను తాగడం వల్ల కీళ్లు, ఎముకలపై చెడు ప్రభావం పడుతుంది. ఇలా నీళ్లను తాగడం వల్ల కీళ్లు అరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా తాగడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. ఎముకలు బలహీనపడితే కీళ్లనొప్పులు వస్తాయి.