మన శరీరంలో నీరే 70 శాతం ఉంటుంది. అందుకే మన ఆరోగ్యానికి నీళ్లు అత్యవసరం. నీళ్లను పుష్కలంగా తాగినప్పుడే మనం ఎలాంటి జబ్బు సోకకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఒక వేళ శరీరంలో నీటి శాతం తగ్గితే ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయి. కీళ్ల నొప్పులు, మలబద్దకం, తలనొప్పి, రక్తపోటు తగ్గడం, బ్రెస్ట్ క్యాన్సర్, ఊబకాయం వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే శరీరానికి అవసరమయ్యే నీటిని ఖచ్చితంగా తాగాలి. ఇందుకోసం రోజు నీటిని ఎంత తాగాలి.. ఏ సమయంలో తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..