పరగడుపున జీలకర్ర, వాము, సోంపు నీటిని తాగడం వల్ల కడుపులోని యాసిడ్లు సమతుల్యం అవుతాయి. కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.
వాము అదనపు క్యాలరీలను బర్న్ చేసి శరీరాన్ని కాపాడుతుంది. జీలకర్రలోని సుగంధ సమ్మేళనాలు వికారం, వాంతుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని గింజలను నమలడం వల్ల కడుపు నొప్పి తగ్గి, వాంతులు కూడా అదుపులోకి వస్తాయి.
జీలకర్ర, వాము, సోంపు జీర్ణ ఎంజైమ్ల పనితీరును పెంచి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాము కషాయం తాగడం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగిపోతాయి. వాము యాంటీఆక్సిడెంట్లకు నిధి లాంటిది.