పిల్లలకు దగ్గు ఉంటే ఈ పండ్లను తినిపించకండి

First Published Jan 27, 2023, 9:40 AM IST

చలికాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలే తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. కారణం వీరిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటమే. ఇకపోతే పిల్లలకు దగ్గు ఉన్నప్పుడు కొన్ని పండ్లను అసలే తినిపించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లు దగ్గును మరింత ఎక్కువ చేస్తాయి. 

చలికాలంలో వీచే చల్లని గాలుల వల్ల ఒక్కటేమిటీ ఎన్నో రోగాలొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలే తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. జలుబు, దగ్గుతో పాటుగా అలెర్జీ కూడా తరచుగా వస్తుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యలున్న పిల్లలకు కొన్ని పండ్లను అసలే తినిపించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 
 


ఈ పండ్లను ఇవ్వకండి..

దగ్గు వల్ల గొంతుతో పాటుగా కడుపు నొప్పి పెడుతుంది. అయితే ఈ దగ్గు నుంచి తొందరగా బయటపడాలంటే మాత్రం వారికి 15 నుంచి 20 రోజుల వరకు ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, లిచీలను అసలే ఇవ్వకూడదని నిపుణులు సలహానిస్తున్నారు. నిజానికి అలెర్జీ, దగ్గు, న్యూమోనియా, బ్రోన్కైటిస్, అధిక జ్వరం, టాన్సిల్స్లిటిస్, చెవి ఇన్ఫెక్షన్ సమస్యలు పిల్లలకు తరచుగా సోకుతుంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పండ్లను ఎందుకు తినకూడదంటే.. స్ట్రాబెర్రీలు హిస్టామిన్ ను విడుదల చేస్తుంది. ఈ హిస్టామిన్ దగ్గును కలిగిస్తుంది. ఇప్పటికే దగ్గు ఉంటే అది మరింత ఎక్కువ అవుతుంది. ఇకపోతే ద్రాక్ష, లిచీల్లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. అందుకే ఈ పండ్లను పిల్లలకు తినిపించకూడదని నిపుణులు చెబుతున్నారు. 

తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు

పిల్లలకు దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే ఎక్కువ రంగు, కృత్రిమంగా తియ్యని, కృత్రిమ రంగు లేదా ఎక్కువ చల్లగా ఉండే ఆహారాలను  తినిపించకూడదని చిన్నపిల్లల డాక్టర్లు సలహానిస్తుంటారు. ఎందుకంటే ఇవి దగ్గును ఎక్కువ చేస్తాయి. అలాగే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. 
 

నివారించాల్సిన ఆహారాలు

క్యాండీలు, ఐస్ క్రీం, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, క్యాండీలు, చాక్లెట్లు, డోనట్స్, పేస్ట్రిలు, ద్రాక్ష, రిఫ్రిజిరేటర్ లో ఉండే చల్లని ఆహారాలకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి దగ్గును బాగా పెంచుతాయి. ముఖ్యంగా దగ్గు అంత తొందరగా తగ్గదని నిపుణులు చెబుతున్నారు. 
 

దగ్గు తగ్గాలంటే చేయాల్సినవి

దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్లేస్ లకు పిల్లలను పంపించకూడదు. ఎందుకంటే ఇవి దగ్గును ప్రేరేపిస్తాయి. ఇప్పటికే దగ్గు ఉంటే.. అది మరింత ఎక్కువవుతుంది. ఎయిర్ ఫ్యూరిఫయర్ దగ్గును కొంతవరకు తగ్గిస్తుతంది. ముఖ్యంగా  పిల్లలకు బొమ్మలు ఇవ్వాల్సి వస్తే.. వాటిని వాష్ చేసిన తర్వాతే ఇవ్వండి. అలాగే పావురాలకు దూరంగా ఉంచండి. ఇవి అలెర్జీని కలిగిస్తాయి. 

click me!