కొంతమంది చలికాలంలో వేడి వేడి ఫుడ్స్ ను తినడానికే ఇష్టపడతారు. అలా అని ఎప్పటికప్పుడు వండుకుని తినరు. పొద్దున్న వండిన వాటిని ఓవెన్ లో పెట్టి తింటుంటారు. దీనికంటే ఏపూటకు ఆపూట వండుకుని తినడమే మంచిదంటున్నారు నిపుణులు. కానీ వండిన ఆహారాలను పదే పదే వేడి చేసి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇలా వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషకాలన్నీ పోతాయి. దీంతో పాటుగా ఈ ఫుడ్ లో హానికరమైన బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. దీంతో ఆహారం విషపూరితంగా మారుతుంది. మైక్రోవేవ్ లో ఫుడ్ ను వేడి చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేసి తింటే కడుపులో గ్యాస్, కలుపు కలత, ఫుడ్ పాయిజనింగ్, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి ఫుడ్సు ను వేడిచేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..