దివాళి 2022: మీరు డయాబెటీస్ పేషెంట్లా.. ఇదిగో ఈ దీపావళికి మీరు తినగలిగే షుగర్ ఫ్రీ స్వీట్లు ఇవే..

First Published Oct 21, 2022, 10:01 AM IST

దీపావళి  అంటేనే స్వీట్లు.. స్వీట్లతోనే పండుగ పూర్తి అవుతుంది. ఎప్పుడూ తినని వారు కూడా దీపావళికి పక్కాగా స్వీట్లను తింటుంటారు. డయాబెటీస్ పేషెంట్లు కూడా కొన్ని రకాల స్వీట్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. అవేంటంటే.. 

దీపావళికి కేవలం టపాసులు పేల్చడమే కాదు.. ఇష్టమైన స్వీట్లను నచ్చినన్ని లాగించొచ్చు కూడా.. కానీ అందరూ కాదు. డయాబెటీస్ పేషెంట్లు, ఊబకాయంతో బాధపడేవారు స్వీట్లకు దూరంగా ఉంటారు. ఎంత తినాలనిపించినా పక్కన పెడుతుంటారు. ఎందుకంటే వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. చక్కెర వల్ల మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే.. ఊబకాయులు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. అయినా పండగ కాబట్టి వీటిని కొంచెమైనా తినాలని అనిపిస్తుంది. కానీ వీళ్ల ఆరోగ్యానికి చక్కెర చాలా డేంజర్. అయితే చక్కెర లేని కొన్ని రకాల స్వీట్లు కూడా బలే టేస్టీగా ఉంటాయి. వాటిని ఎంచక్కా తినొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.. 
 

ఆల్మండ్ బర్ఫీ: ఖోయా తురుము, బాదం పప్పులు, స్వీటెనర్ తో దీన్ని తయారుచేసుకోవాలి. ముందుగా తక్కువ మంట మీద ఖోయా ఉడికించండి. సుమారు 4 నిమిషాల తర్వాత  దించి పక్కన పెట్టుకోండి. దీనిలో వేయించిన బాదం మిక్స్ చేయండి. కావాలంటే మీరు షుగర్ ఫ్రీ సిరప్‌ను ను దీనికి కలపొచ్చు. అంతే చల్లారిన తర్వాత ఎంచక్కా తినొచ్చు. 
 

కొకొనట్ బర్ఫీ:  కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకుల పొడితో దీన్ని తయారుచేస్తారు. ముందుగా స్టవ్ పై బాణలి పెట్టుకుని కొబ్బరి పొడిని కొద్ది సేపు వేయించండి. సన్నని మంటపై సుమారు 5-10 నిమిషాలైనా వేయించాలి. కిందికి దించి దీనిలో యాలకుల పొడి వేయండి. దీన్ని పక్కన పెట్టేసి.. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో బెల్లం వేసి స్టవ్ పై పెట్టాలి. ఇది చిక్కగా మారిన తర్వాత దీనిలో.. పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి బాగా కలపి దించేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బర్ఫీ ఆకారంలో కట్ చేయాలి. అంతే రుచికరమైన స్వీట్లు తయారైపోతాయి. 

ఖర్జూర  లడ్డూలు: ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ తో ఈ లడ్డూలను తయారుచేస్తారు. ముందుగా స్టవ్ పై బాణలి పెట్టుకుని అందులో కచ్చపచ్చగా మిక్స్ చేసిన ఖర్జూరం వేసి మెత్తగా అయ్యేవరకు వేడి చేయాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ ను బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మెత్తగా అయిన ఖర్జూరం లో డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి. చిన్న చిన్న ముద్దలను తీసుకుని లడ్డూల్లా చుట్టండి.. అంతే టేస్టీ టేస్టీ ఖర్జూర లడ్డూలు తయారైనట్టే. 
 

కేసర్ పిర్ని: దీనికోసం ముందుగా పాలను మరిగించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత బియ్యాన్ని బాగా కడిగి మెత్తగా రుబ్బుకోండి. ఒక టేబుల్ స్పూన్ పాలలో కుంకుమపువ్వును నానబెట్టుకోండి. అలాగే పిస్తాపప్పుల తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టండి. ఇవి మరుగుతున్నప్పుడు బియ్యం పేస్ట్ ను వేసి కలుపుతూ ఉండండి. ఆ తర్వాత దీనిలో ఏలకుల పొడి, కుంకుమపువ్వు పాలను వేయండి. ఈ మిశ్రమం గట్టిపడటం స్టార్ట్ అయితే కిందికి దించండి. ప్రిజ్ లో కాసేపు ఉంచి సర్వ్ చేసుకుంటే సరి.. 

Image Credit: Freepik

గుడ్ మైసూర్ పాక్:  ముందుగా బేసన్‌ను బాణలీలో వేసి తక్కువ మంటపై వేయించండి. దీనిలో కొంచెం నెయ్యిని వేసి కలపండి. ముఖ్యంగా ఇది ముద్దలు ఏర్పడకుండా చూసుకోండి. అలాగే ఇంకో పక్క బెల్లం సిరప్ ను తయారుచేయండి. ఈ సిరప్‌ రెడీ అయిన తర్వాత దానిలో బెసన్-నెయ్యి మిశ్రమాన్ని కలపండి. ఒక ట్రే ను తీసుకుని దానికి వెన్న ను అప్లై చేసి ఆ పిండిని అందులో పోయండి. 20 నిమిషాల పాటు వాటిని కట్ చేసుకుని సర్వ చేయండి.  

click me!