ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం చేసిన తర్వాత మందులు వేసుకోమని డాక్టర్లు సూచిస్తే.. చాలా మంది భోజనం తిన్న వెంటనే, కాస్త కూడా గ్యాప్ లేకుండా టాబ్లెట్స్ వేసేసుకుంటారు. ఇది చాలా తప్పు అని డాక్టర్లు చెబుతున్నారు. తిన్న తర్వాత అంటే భోజనం చేసిన కనీసం 15 నుంచి 20 నిమిషాల తర్వాత మందులు వేసుకోవాలని చెబుతున్నారు.