ప్రతి రోజు స్నానం చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నిద్ర లేచిన తర్వాత, బాగా చెమట పట్టిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. లేకపోతే శరీరంపై చేరిన అనేక క్రిములు, బ్యాక్టీరియా అనేక చర్మ సమస్యలను కలిగిస్తాయి. సాధారణంగా స్నానానికి మరీ చల్లని నీరు, మరీ వేడి నీరు మంచిది కాదు. శరీర ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా గోరు వెచ్చని నీటితో ఏ కాలంలోనైనా స్నానం చేయొచ్చు. అయితే స్నానం చేసేటప్పుడు శరీరంపై ఉన్న మట్టి, చెమట, క్రిములు పోయేలా శుభ్రంగా రుద్దుకోవడం చాలా ముఖ్యం. మీరు స్నానం చేసేటప్పుడు ఏ శరీర భాగాన్ని ముందు రుద్దుకుంటారు. ఏ విధంగా స్నానం చేస్తే ఆరోగ్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది స్నానం చేసేటప్పుడు సబ్బుతో ముందుగా ఒళ్లు రుద్దు కుంటారు. అంటే చేతులు, పొట్ట, ఛాతీ, వీపు భాగం, కాళ్లు రుద్దుకుంటారు. చివరిగా మొహం రుద్దుకుంటారు. కాని ఇది కరెక్ట్ కాదని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా మొహం రుద్దుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే సబ్బుతో మొహం రుద్దుకుంటే అక్కడ ఉన్న క్రిములు, బ్యాక్టీరియా చనిపోతాయి. లేదా ఆ సబ్బు నురగలో చేరి నీటి ద్వారా బయటకు పోతాయి.
కాని ముందు చేతులు, పొట్ట, కాళ్లు ఇతర శరీర భాగాలు రుద్దుకొని శుభ్రం చేసుకున్న తర్వాత మొహం రుద్దుకుంటే ఆ మలినాలు శరీర భాగాలపై ఉండిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ దగ్గర క్రిములు ఉండిపోతే అనేక చర్మ సమస్యలు వస్తాయంటున్నారు.
స్నానం చేసే కరెక్ట్ విధానం..
ముందుగా ముఖాన్ని, చేతులను, కాళ్లను ఇతర శరీర భాగాలను నీటితో పూర్తిగా తడిసేలా నీరు పోయాలి. ఇది శరీర ఉష్ణోగ్రతతో నీటి ఉష్ణోగ్రతను సమానం చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు తలస్నానం చేయాలనుకున్నా ముందుగా శరీరం మొత్తాన్ని తడిపి చివరిగా తలపై నీళ్లు పోసుకోవాలి. ఒకసారిగా తలపై నీళ్లు పోస్తే తలపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
సబ్బును ఉపయోగించే సరైన విధానం
శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బు చాలా అవసరం. అయితే ఎక్కువ సబ్బు రుద్దేయడం కూడా మంచిది కాదు. సబ్బు ఎక్కువ పెట్టి రుద్దితే చర్మం పొడిబారిపోతుంది.
మొదట మొహం రుద్దుకొని నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు, మెడ, భుజాలు, అరచేతులు, ఛాతీ, వీపు రుద్దుకోవాలి. తర్వాత నీటితో మొహం పైనుంచి నీరు పోస్తూ సబ్బు లేకుండా శుభ్రం చేసుకోవాలి. చివరిగా కాళ్లు, పాదాలు, వేళ్లు, గోర్లు సబ్బుతో రుద్దు కోవాలి. తర్వాత కూడా మొహం పైనుంచి నీరు పోసుకుంటూ కాళ్లపై ఉన్న సబ్బు మొత్తం పోయేలా రుద్దు కోవాలి.
తలస్నానం చేసే ముందు జాగ్రత్తలు
మీరు తలస్నానం చేయాలనుకుంటే ముందు బాడీ మొత్తం తడిసేలా నీళ్లు పోసుకొని చివరిగా తలపై నీళ్లు పోసుకోవాలి. తలకు షాంపూ లేదా హెర్బల్ ఉత్పత్తులు వాడితే మరింత ఆరోగ్యంగా ఉంటుంది. బాగా రుద్దుకున్న తర్వాత నీటితో జుట్టు మొత్తం బాగా శుభ్రం చేసి, తర్వాత శరీరాన్ని సబ్బుతో రుద్దుకోవాలి. ఇలా చేస్తేనే శరీరంపై ఉన్న క్రిములు నాశనం అయిపోవడం లేదా నీటి ద్వారా బయటకు పోవడం జరుగుతుంది. వారానికి 2-3 సార్లు మాత్రమే షాంపూ వాడటం మంచిది.
ఇది కూడా చదవండి 6-6-6 నడక అంటే ఏంటో తెలుసా? ఈ ఒక్క వాకింగ్ రూల్తో పూర్తి ఆరోగ్యం