అయితే మధుమేహులు గోధుమలు, బియ్యంతో పాటుగా బంగాళాదుంపలకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి.
షుగర్ పేషెంట్లు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను ఏ మాత్రం స్కిప్ చేయకూడదు. అయితే దీన్ని మితంగా తినాల్సి ఉంటుంది. వీటిలో పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మిమ్మల్ని రోజంగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ఇన్సులిన్ థెరపీ తీసుకుంటున్న వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే హైపోగ్లైసీమియా, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కవ వంటి సమస్యలు వస్తాయి.