ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మారిన మన జీవన విధానం, తీసుకునే ఆహారం వంటి ద్వారా కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. వీటికి తోడు నిద్రపోయే సమయాన్ని మరిచి ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీల్లో మునిగిపోవడం వల్ల కూడా నిద్రకు దూరమవుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను రాత్రుళ్లు చూడటం వల్ల ఆ స్క్రీన్ వెలుతురు మన కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తద్వారా మనకు నిద్ర దూరమవుతుంది. అందుకే పడుకునే అరగంట ముందే వీటన్నింటికి దూరంగా ఉండాలి.