చియా, అవిసె వంటి విత్తనాలకు ఎక్కువ సమయం అవసరం లేదు. 20-30 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. నువ్వులు, గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్ విత్తనాల్లాంటివి 4-6 గంటలు సోక్ చేసుకోవాలి. వాటిలో ఉండే చేదు తగ్గి, పోషకాలు బాగా అందుతాయి. జీడిపప్పు, నువ్వులు, గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్....శరీరానికి సరిపడా కాల్షియం, పోషకాలు అందిస్తాయి.
ధాన్యాలు, పప్పుల విషయంలో నానబెట్టడం మరీ ముఖ్యం. బియ్యం కూడా అరగంట నుంచి 2 గంటలు నానబెట్టాలి. బ్రౌన్ రైస్కు అయితే ఇంకా మంచిది. ఓట్స్, క్వినోవా లాంటివి కచ్చితంగా 6-8 గంటలు నానబెట్టాలి, అప్పుడే వాటిని తినాలి. లేకపోతే కడుపు భారంగా అనిపిస్తుంది. పెసరపప్పు, శనగలు, రాజ్మా వంటి పప్పులను నానబెట్టడం తప్పనిసరి. ముఖ్యంగా రాజ్మా లాంటివి 10-12 గంటలు నానబెట్టకుండా వండితే జీర్ణ సమస్యలు రావచ్చు. నానబెట్టిన నీటిని పారబోసి వండితే కడుపులో గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.