370 Biryani Controversy: హద్దులు మీరుతున్న స్టాండ్ ఆప్ కామెడీ..అమ్మాయిలు తక్కువేం కాదు

Published : Jun 12, 2026, 10:53 AM IST

370 Biryani Controversy: బిర్యానీ కొనిచ్చినంత మాత్రాన ఎదుటి వ్యక్తిపై సర్వ హక్కులు వచ్చేస్తాయా? భావప్రకటనా హక్కు పేరుతో మహిళల్ని కించపరిచేలా మాట్లాడాతారా? అలాంటి వాళ్లను ఖండించాల్సింది కామెడీ షో పేరుతో వెకిలి చేష్టలు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. 

PREV
16
స్టాండ్ ఆప్ కామెడీ పేరుతో బూతు కామెడీ

కామెడీ చేయడం అంటే నలుగురిని నవ్వించడం, ఆ కామెడీ కూడా హెల్దీగా ఉండాలి.అంతేకానీ ఎదుటి వాళ్లను కించపరిచేలా మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడటం, అమ్మాయిలపైన జోకులు చేయడం ఇదేం కామెడీ. ఈ మధ్య స్టాండ్ ఆప్ కామెడీ పేరుతో చేసే కామెడీ అంతా అసభ్యం, వర్గాలను టార్గెట్ చేయడం మరొకటి లేదు. ఎలా అయిపోయింది అంటే అసభ్యం లేనిదే కామెడీ లేదు అన్నట్లు తయారైంది. 

26
రూ.370 బిర్యానీ రూపాయల కథేంటి?

ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ ఎంత ఉంటుంది? రూ.300 లేదా రూ.400. కానీ గుర్గావ్‌కు చెందిన ఒక యువకుడికి ఈ 370 రూపాయల బిర్యానీ తన ఉద్యోగం ఊడేలా చేసింది. కేవలం బిర్యానీ పెట్టిస్తే అమ్మాయి తనకి ఏదో బాకీ పడిందన్న అతని మాటలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అతనొక్కడే కాదు..అమ్మాయిలు కూడా ఇలానే ప్రవర్తించడం జనాల మైండ్ సెట్ ఇంత దిగజారిపోయిందా, పబ్లిక్‍గా ఇంత గలీజు మాటలేంటి? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? ఆ రూ.370 బిర్యానీ రూపాయల కథేంటి?

36
ప్రణీత్ మోర్ స్టాండప్ కామెడీ షోతో మొదలైన వివాదం

ఈ వివాదం అంతా కమెడియన్ ప్రణీత్ మోర్ నిర్వహించిన ఒక స్టాండప్ కామెడీ షోతో మొదలైంది. గుర్గావ్‌లో జరిగిన ఈ షోలో హిమాన్షు జాంగ్రా అనే 22 ఏళ్ల యువకుడు స్టేజ్ మీద తన డేటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అతను ఒక అమ్మాయికి రూ.370 చికెన్ బిర్యానీ కొనిచ్చాడట. తిన్న తర్వాత ఆ అమ్మాయి తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడిగిందంట. కానీ అలా ఎలా వెళ్తుంది. రూ.370 ఖర్చు పెట్టాను, ఆ పైసలు వసూలు చేసుకోవాలి కదా అంటూ పచ్చిగా షోలో మాట్లాడాడు. 

46
కామెడీ కన్నా బూతులే

ఇది స్టాండప్ కామెడీ షోనే కావొచ్చు. కానీ అందులో హెల్దీ కామెడీ కన్నా..అసభ్యం పదాలే ఎక్కువగా ఉన్నాయి. అతను మాట్లాడింది జోకే కావొచ్చు. కానీ మైండ్ సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అతను ఆ అమ్మాయిని ఒక చీకటి పార్కులోకి తీసుకెళ్లాడట. అక్కడ ఆమె 'వద్దు' అంటున్నా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించానని, అసభ్యంగా ప్రవర్తించానంటూ హిమాన్షు గర్వంగా చెప్పుకొచ్చాడు. ఆ మాటలకు అక్కడున్న అబ్బాయిలు నవ్వడం పక్కన పెడితే...ఆ అమ్మాయిలు కూడా నవ్వడం దారుణం. కమెడియన్ ప్రణీత్ మోర్ దీన్ని 'పీక్ గుర్గావ్ కంటెంట్' అని మెచ్చుకుంటూ అతనికి రూ.5వేల నగదు బహుమతి ఇవ్వడం మరింత వివాదాస్పదమైంది.

56
బిర్యానీ ఈజ్ డిన్నర్ నాట్ కన్సెంట్

దీనిపై సెలబ్రీటీలు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. డబ్బు ఖర్చు చేస్తే లొంగిపోతామనుకోవం చాలా తప్పు. ఇదొక చెండాలపు ఆలోచన అని తిడుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో జొమాటో యాప్ కూడా స్పందించింది. బిర్యానీ ఈజ్ డిన్నర్ నాట్ కన్సెంట్ అనే సందేశంతో తన వైఖరి స్పష్టం చేసింది. ముంబై పోలీసులు కూడా తనదైన శైలిలో రియాక్టయ్యారు. రూ.370కు బిర్యానీ వస్తుంది కానీ...లాకప్ లో ఫ్రీగా భోజనం పెడతామంటూ పోస్ట్ చేసింది.

66
డెడ్ బాడీ పార్ట్స్ పై వైద్యురాలి వెకిలి వ్యాఖ్యలు

ఇక్కడ అబ్బాయిలే కాదు కొంతమంది అమ్మాయిలు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఒక వైద్యురాలు సెజల్ పవార్ ఇదే ప్రణీత్ మోర్ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరలవుతున్నాయి. పోస్ట్ మార్టంలో డెడ్ బాడీ పార్ట్స్ పై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయగా అవి వైరలవుతున్నాయి. డాక్టర్ వృత్తిలో ఉండి ఇలాంటి మాటలేంటని మండిపడుతున్నారు. హిమాన్షు ఉద్యోగం పోయింది. మరి ఈమె సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories