భారతదేశంలోనే సుదీర్ఘ నాన్స్టాప్ రన్: భారతీయ రైల్వే వ్యవస్థ మొత్తం మీద రెండు కమర్షియల్ హాట్ల మధ్య అత్యంత ఎక్కువ దూరం నాన్స్టాప్గా ప్రయాణించే రైలు ఇదే కావడం విశేషం. మధ్యలో ఎక్కడా ఆగకపోవడం వల్ల.. ఈ రైలు దాదాపు 528 కిలోమీటర్ల ఈ భారీ దూరాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా కేవలం 5 నుండి 6 గంటల్లోనే కవర్ చేస్తుంది. ఈ సుదీర్ఘ నాన్స్టాప్ సమయంలో ప్రయాణికులు ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా గ్రేట్ వ్యూస్ చూస్తూ, నిరంతర ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉన్నా.. రైలు వేగంగా వెళ్లడం వల్ల అలసిపోయిన ఫీలింగ్ రాదు. చాలా తక్కువ సమయంలోనే తమ డెస్టినేషన్ చేరుకుంటారు.
ట్రెయిన్ జర్నీలను, వేగాన్ని ఇష్టపడే వారికి త్రివేండ్రం రాజధానిలో కోటా-వడోదర మధ్య ప్రయాణించడం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.