ఈ రకంగా అదనంగా వసూలు చేయడంపై ఉషప్ప కండక్టర్ను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. దీంతో ఆర్టీసీపై న్యాయదిశగా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
తమ వాదనలో టీఎస్ఆర్టీసీ అధికారులు ఓ టికెట్ జారీ సమయంలో పొరపాటు జరిగిందని చెప్పారు. ఖమ్మం డిపోకు చెందిన బస్సులో ఉషప్ప ఎల్బీనగర్ వరకు మాత్రమే ప్రయాణించగా, టికెట్ను ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) వరకు వెళ్లే ప్రయాణికుడిగా జారీ చేశారని తెలిపారు.