ఇప్పటికే దేశవ్యాప్తంగా భద్రత మరింత కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో, ఇలాంటి చర్యలు ప్రజల భద్రతకు హానికరం కావచ్చని సూచించారు. పబ్లిక్ ప్రదేశాలు, కార్యక్రమాలు, గుమిగూడే చోట్ల ఎలాంటి పటాకులు పేల్చకూడదని, ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.