సీఎం సమీక్ష, పకడ్బందీ ఏర్పాట్లు
ఈ ఈవెంట్ విజయవంతంగా సాగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ఎయిర్పోర్ట్ నుంచి హోటళ్ల వరకు వీఐపీ వాహనాలు, వెల్కమ్ టీమ్స్, ప్రొఫెషనల్ కోఆర్డినేషన్ కల్పించాలని ఆదేశించారు. అలాగే తెలంగాణ సంప్రదాయాన్ని తెలియజేసేలా హోటళ్లలో వెల్కమ్ కిట్లు, ప్రత్యేక భోజన ఏర్పాట్లు, పర్సనలైజ్డ్ హాస్పిటాలిటీ ఉండేలా చూడాలని చెప్పారు.