తెలిసిన వారు ఎవరైనా గుండె పోటుతో మరణిస్తే ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోతుంది. మనం ఎంత వరకు భద్రంగా ఉన్నామన్న ప్రశ్న తలెత్తడం ఖాయం. దీంతో చాలా మంది జాగ్రత్త పడడం కంటే ఆందోళన చెందడం ఎక్కువుతోంది. అనవసరంగా ఒత్తిడి పెంచుకుంటున్నారు. రకరకాల టెస్టులు చేయించుకుంటూ జేబులు గుల్లా చేసుకుంటున్నారు. అయితే ఏ సమయాల్లో పరీక్షలు చేయించుకోవాలి.? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటే.
ప్రస్తుతం శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. ఈ స్థానంలో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. 30 నుంచి 40 ఏళ్ల మధ్యలోని వారు బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. భారతదేశంలో మరణాలకు గుండెపోటు మొదటి స్థానంలో ఉందంటే నమ్ముతారా.? భారత దేశంలో 50 శాతం గుండెపోటు బాధితుల్లో 50 ఏళ్ల లోపు వారే ఉంటున్నారు. అలాగే వీరిలో 25 శాతం మంది 40 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు మాత్రమే కావడం ఆందోళన కలిగిస్తోంది.