ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలే ఇందుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి వల్ల కళ్లు, మూత్రపిండాలు, కాలేయం, గుండె తదితర అవయవాలు బలహీనపడతాయి. మధుమేహాన్ని పూర్తిగా తగ్గించే చికిత్స లేదు. తినే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి తింటే బ్లడ్ షుగర్ పెరిగిపోతాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు స్కిప్ చేయకూడదు. అలాగే ఏవి పడితే అవి తినకూడదు. బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే మధుమేహులు బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..