మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది: ఒక కప్పులో బియ్యం పిండి (Rice flour), కలబంద గుజ్జు (Alovera gel), తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.