దేశంలో చాలా నగరాల్లో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈడిస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమలు కుట్టడం వల్లే డెంగ్యూ జ్వరం వస్తుంది. ఉష్ణోగ్రత, తేమతో కూడిన వాతావరణంలో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వాంతులు, తీవ్రమైన తలనొప్పి, వికారం, చర్మపు దద్దుర్లు, కీళ్ల నొప్పులు, కళ్ల నొప్పి, కండరాల నొప్పి డెంగ్యూ లక్షణాలు. డెంగ్యూకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయించుకోకపోతే అలసట, వాంతులు, చంచలత, చిగుళ్ల నుంచి రక్తస్రావం, విపరీతమైన కడుపునొప్పి, రక్తస్రావం వంటి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఫాలో అయితే డెంగ్యూ నుంచి చాలా త్వరగా కోలుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే?