ఈ అధ్యయనం ప్రకారం.. డయాబెటీస్ పేషెంట్లలో.. ఈ వ్యాధి వారి ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఇది బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుందని అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ ఎక్కువగా వృద్ధుల్లో ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలోనే ఈ సమస్య ఎక్కువగా ఉండొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.