శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది
సాత్విక ఆహారాన్ని తినడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందుతుంది. దీంతో ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. వాపు, తలనొప్పి, చర్మపు దద్దుర్లు, అలసట, మొటిమలు మొదలైన సమస్యలు ఉంటే ఖచ్చితంగా సాత్వికాహారాన్ని తినండి. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి.. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు, తేనె కలుపుకుని తాగండి. దీని వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వస్తాయి.