చలికాలంలో తరచుగా మన ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. చలికాలంలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను ఖచ్చితంగా తినాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సీజన్ లో అంజీర పండ్లన తినడం చాలా మంచిది. ఎందుకంటే ఈ పండ్లు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. రాత్రిపూట ఒక కప్పు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వీటిని తింటే మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అదుతాయి. వీటిని ఇతర డ్రై ఫ్రూట్స్ తో పాటుగా కూడా తినొచ్చు. ఈ పండ్లలో విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అసలు చలికాలంలో నానబెట్టిన డ్రై అంజీరలను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.