పెరుగుతో వీటిని కలిపితే... విషంతో సమానం..!

First Published Jul 6, 2022, 11:39 AM IST

మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇన్ని పోషకాలు ఉన్న  పెరుగుతో కొన్ని ఆహారాలను మాత్రం కలిపి తీసుకోకూడదట. అది ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీస్తుందట.

వేసవిలో  ప్రతి ఒక్కరూ కచ్చితంగా పెరుగు తినాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక చిన్న గిన్నె పెరుగు తింటే.. కడుపులో హాయిగా ఉంటుంది. పెరుగులో ఉండే బాక్టీరియా జీర్ణక్రియ ప్రక్రియలో సహాయం చేస్తుంది కాబట్టి ఇది కడుపుని శాంతపరుస్తుంది. పెరుగు లో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే.. ఇది ఇతర ఆహారాల నుండి పోషకాలను గ్రహించడంలో శరీరానికి సహాయపడుతుంది.  అంతేకాదు..మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇన్ని పోషకాలు ఉన్న  పెరుగుతో కొన్ని ఆహారాలను మాత్రం కలిపి తీసుకోకూడదట. అది ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీస్తుందట. కాబట్టి.. పెరుగుతో పాటు కొన్ని ఆహారాలను కలిపి తీసుకోకూడదట. అవేంటో ఓసారి చూద్దాం...
 

1.చేప..

చేపలను ఆహారం గా తీసుకునేటప్పుడు దానితో పాటు పెరుగు కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే అవి రెండూ ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. జంతువుల ప్రోటీన్‌ను వెజ్ ప్రోటీన్‌తో కలిపినప్పుడు, మానవ శరీరం కలిసి జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. ఈ రెంటినీ కలపడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.

2.నూనె ఆహారాలు..

పెరుగును పరాటా, భాతురా లేదా పూరీ వంటి నూనె పదార్థాలతో కలిపి తీసుకుంటే, అది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అంతేకాదు.. రోజంతా బద్దకంగా ఉండేలా చేస్తుంది. అందుకే.. నూనెలో వేయించిన ఆహారాలతో పెరుగు కలిపి తీసుకోకూడదు. 

3.మామిడి పండు..

మామిడి వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది, అయితే పెరుగు శీతలకరణి అని పిలుస్తారు, మీరు ఈ రెండింటినీ కలిపితే, అది జీర్ణక్రియ ప్రక్రియలో అసమతుల్యతను కలిగిస్తుంది. చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఈ రెండు ఆహారాలు కలిసి మీ శరీరంలో విషాన్ని కలిగిస్తాయి. చాలా మంది పెరుగు అన్నంలో మామిడి పండు కలిపి తీసుకుంటూ ఉంటారు. కానీ అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
 

4. ఉల్లిపాయ..

మామిడికాయలాగే, ఉల్లిపాయ కూడా వేడి స్వభావం కలిగి ఉంటుంది.  కాబట్టి.. పెరుగుతో.. ఉల్లిపాయ కలిపి తీసుకోకూడదు. ఈ రెండు ఆహారాలను కలిపితే, దద్దుర్లు,  సోరియాసిస్ వంటి చర్మ అలెర్జీలకు దారి తీస్తుంది.

5.పాలు..

పొరపాటున కూడా పాలు, పెరుగు లను కలిపి తీసుకోకూడదు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల..మీ శరీరంలో ఎసిడిటీ, గుండెల్లో మంట, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి, ఎందుకంటే పాల ఉత్పత్తులు రెండింటిలో కొవ్వు , ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అరుగుదల సమస్య కూడా వస్తుంది.

click me!