సాధారణంగా బ్రెడ్ మైదా పిండితో తయారు చేస్తారు. ఇది మహిళల్లో అజీర్తి, మలబద్ధకానికి దారి తీస్తుంది. సాధారణంగానే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మలబద్ధకం వేధిస్తుంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. దీనికి తోడు బ్రెడ్ తీసుకుంటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే అదే పనిగా బ్రెడ్ తినడం మంచిది కాదని అంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు తీసుకుంటే పర్లేదు కానీ ఎక్కువగా తీసుకోకూడదని అంటున్నారు.